నేటి తెలుగు పత్రిక,mar 10: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ 59వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్ తో పాటు పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీఎల్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం మరియు హెచ్ఓడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అలాగే ఈపీసీ విధానంలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమావేశంలో చర్చ జరిగింది.

