అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి మంత్రి నారా లోకేష్కు ఆహ్వానం
అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి విశిష్ట అతిథిగా రావాలని కోరుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసిన ట్రస్ట్ ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ మరియు ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ట్రస్ట్ ప్రతినిధులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
నారా లోకేష్ గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 3, 2025న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టును, కేవలం ఆరు నెలల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం విశేషం.అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా, ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ 58 అడుగుల భారీ స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ (Statue of Sacrifice) విగ్రహాన్ని నిర్మించారు.
కార్యక్రమ వివరాలు
తేదీ: 16 మార్చి, 2026.
సమయం: సాయంత్రం 3.00 గంటలకు.
వేదిక: శాఖమూరు పార్క్, తుళ్ళూరు – పెదపరిమి రోడ్డు, అమరావతి.
ఈ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు.



