ఎన్టీఆర్ భవన్, మంగళగిరి,Mar 10,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. కావున, ప్రజలు, పార్టీ కార్యకర్తలు గమనించగలరు.
రేపటి నుండి ప్రజావేదికలో పాల్గొనే నాయకుల షెడ్యూల్ :-
- 11.03.2026 – APCOB చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారు, ఏపీ వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు.
- 12.03.2026 – రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు గారు, ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ గొట్టిముక్కల రాఘురామరాజు గారు.
- 14.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పర్చూరి ఆశోక్ బాబు గారు.
- 16.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ఏపీ కుమ్మారి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పేరేపి ఈశ్వర్ గారు.
- 17.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, APEWIDC చైర్మన్ శ్రీ ఎస్.రాజశేఖర్ గారు
- 18.03.2023 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారు.
