మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం తెలంగాణ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఈ నెలాఖరు నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా రూ.4,500 కోట్లు, తర్వాత మరో రూ.4,500 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ డబ్బులు దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
రైతు భరోసా పథకం వివరాలు
రైతు భరోసా పథకం తెలంగాణ కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థిక సహాయం అందిస్తోంది.
- ప్రతి సంవత్సరం రెండు విడతల్లో నిధులు విడుదల
- ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం
- డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ఎందుకు ఆలస్యం?
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యమైంది. ఎన్నికలు పూర్తయ్యాక ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదలకు సిద్ధమవుతోంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే:
- రైతు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావాలి
- భూమి రైతు పేరుమీద ఉండాలి
- భూమి వివరాలు ధరణి పోర్టల్లో నమోదు అయి ఉండాలి
కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు మండల వ్యవసాయ అధికారి లేదా క్లస్టర్ అధికారిని సంప్రదించి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు
- పట్టాదారు పాసుపుస్తకం
- ఆధార్ కార్డు
- బ్యాంక్ ఖాతా వివరాలు
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
ప్రస్తుతం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.
