Breaking News

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మసీదు వద్ద, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయం లో రాష్ట్ర పార్టీ కార్యని ర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యం పెంపొందించాలని, హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా మెలగాలని, పవిత్ర రంజా న్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజే స్తూ, ముస్లిం సోదరులు వారి కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా రంజా న్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మసీదులో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేసిన వారికి ఖర్జూర పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, నాయకులు కోడూ రు ఆంజనేయ వాసు, జాస్తి సురేష్, బత్తుల దుర్గారావు, మల్లెల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *