మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి – ఐశ్వర్యల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహ వేడుక సాంప్రదాయబద్ధంగా నిర్వహించగా, అతిథులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
