Breaking News

బండి సంజయ్ కుమార్ యాత్రలో తేనెటీగల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కరీంనగర్ జిల్లాలో జరిగిన బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో ఆకస్మిక ఘటన చోటుచేసుకుంది. యాత్ర సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో కలకలం రేగింది.ఈ ఘటన వెదిరా గ్రామంలో జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిధిలో యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత యాత్ర కొనసాగినట్లు సమాచారం.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *