మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కరీంనగర్ జిల్లాలో జరిగిన బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో ఆకస్మిక ఘటన చోటుచేసుకుంది. యాత్ర సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో కలకలం రేగింది.ఈ ఘటన వెదిరా గ్రామంలో జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిధిలో యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత యాత్ర కొనసాగినట్లు సమాచారం.
