యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణoలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ శనివారం రోజున విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష పాడ్స్, పెన్నులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి గౌరవం తేవాలని,భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అన్నారు.పదవ తరగతి పరీక్షలను బాగా రాసి, మంచి మార్కులను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, తమ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు. పుస్తకా లతో పాటు, సమాజాన్ని చదివి, మంచి పౌరులుగా రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో సాయితేజ, నరేందర్,మహేష్ తదితరులు న్నారు.
