మార్చి 14(నేటి తెలుగు పత్రిక): సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గొప్ప ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యమవడానికి నారా లోకేష్ అందించిన సహకారం కీలకమని ఆయన స్పష్టం చేశారు.ప్రపంచ స్థాయిలో అటానమస్ మారిటైమ్ టెక్నాలజీ అభివృద్ధికి ఈ సెంటర్ ముఖ్య కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధితో పాటు కొత్త ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నామని నికుంజ్ పరాశర్ తెలిపారు.
