Breaking News

మోట కొండూరు పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మోటకొండూరు మండలం పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.దివాలాలుపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆరెగూడెం గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మోటకొండూరు పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి కూడా శంకుస్థాపన నిర్వహించారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా కూరగాయల మార్కెట్ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మహిళా సంఘాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు , సర్పంచులు, మండల నాయకులు మాజీ ఎంపిటిసిలు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *