Breaking News

యాదాద్రి జిల్లాలో గ్యాస్ కొరత లేదు ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని ఎటువంటి వినియోగదారులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ఎల్.పి.జి. గ్యాస్ కొరత లేదని, రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం కాదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్.పి.జి. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతుంది గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని తెలిపారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైనంత గ్యాస్ నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు. ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసుపత్రి లలో,రెసిడెన్షియల్ హాస్టల్స్, విద్యా సంస్థలలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *