యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పిలుపు మేరకు శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజాపేట మండల సబ్ స్టేషన్ ముందు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ మరియు లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అనంతరం AE గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో రైతులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
