మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ వినియోగానికి ఎలాంటి LPG కొరత లేదని తెలిపారు. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొంత కొరత ఉందని పేర్కొన్నారు.ఎల్పీజీ సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఈ రోజు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, గృహ వినియోగ గ్యాస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
