Breaking News

యుద్ధం మధ్య వాహనదారులకు ఊరట.. కొన్ని నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్చి 15న విడుదలైన తాజా ధరల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గగా, మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటినప్పటికీ దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా Delhi మినహా మిగతా ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100కు పైగా కొనసాగుతోంది.

ఢిల్లీ – ముంబైలో ధరలు స్థిరం

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 కాగా, డీజిల్ ధర రూ.87.67గా ఉంది. ఇక్కడ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.103.54, డీజిల్ ధర రూ.90.03గా కొనసాగుతున్నాయి.

కోల్‌కతాలో స్వల్ప పెరుగుదల

కోల్‌కతాలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.105.45కి చేరింది. అయితే డీజిల్ ధర మాత్రం రూ.92.02 వద్దనే స్థిరంగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం స్పష్టం

చెన్నైలో తగ్గిన ధరలు

చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 18 పైసలు తగ్గి రూ.100.80గా మారింది. అలాగే డీజిల్ ధర కూడా 9 పైసలు తగ్గి రూ.92.39కు చేరింది.

హైదరాబాద్‌లో స్థిరంగా ధరలు

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర సుమారు రూ.107.46గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ నగరంలో ధరలు పెద్దగా మారలేదు.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో Brent crude oil ధర బ్యారెల్‌కు సుమారు 103.14 డాలర్ల వద్ద ఉంది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు (WTI) ధర బ్యారెల్‌కు 98.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరి నుంచి ఈ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ దరఖాస్తులు ప్రారంభం.. ఖాతాల్లో రూ.6,000 జమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *