మార్చి 15(నేటి తెలుగు పత్రిక): దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేయనున్నట్లు Election Commission of India వర్గాలు తెలిపాయి. నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.సమాచారం ప్రకారం సాయంత్రం లోపు ఎన్నికల పూర్తి షెడ్యూల్ను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలింగ్ తేదీలు, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ గడువు, ఓట్ల లెక్కింపు తేదీలను కూడా అదే సమయంలో ప్రకటించే అవకాశం ఉంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో దేశ రాజకీయాల్లో వేడి మరింత పెరగనుంది.
