హైదరాబాద్, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్కు రావాలని టీపీసీసీ చీఫ్ సవాల్ విసిరారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, డ్రగ్స్ వ్యవహారంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఛాలెంజ్ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీలోనే డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామని, అందులో పాల్గొని నిజం నిరూపించుకోవాలని కేటీఆర్ను మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఎవరు అయినా సరే డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇటీవల రాజకీయంగా డ్రగ్స్ అంశం తీవ్ర చర్చకు దారి తీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గతంలో కూడా కేటీఆర్పై పలు అంశాల్లో తీవ్ర విమర్శలు చేశారు.
