కోదాడ ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు అందుకున్న బడుగుల సైదులు
సిరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉగాది పురస్కారాల అందజేత లో బడుగుల సైదులు కు అవార్డు
పాఠశాల పెరటి తోట సాగు లో నైపుణ్యం ప్రదర్శించిన బడుగుల సైదులు
కోదాడ ,మార్చి 15(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణం లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జీహెచ్ ఆర్ హోండా సౌజన్యం తో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం సాగు సెమినార్, ఉగాది పురస్కారాల అందజేత నిర్వహించారు.కాగా కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడు బడుగుల సైదులు పాఠశాల లో కిచెన్ గార్డెన్, బడి తోట సాగు, పచ్చదనం, పూలు ,పండ్లు, ఫ్యాషన్, ప్రోటాన్, ఔషధ మొక్కల పెంపకం లో విద్యార్థుల భాగస్వామ్యం అవగాహన కల్పించడం, బడి తోట పంటలు ఆకుకూరలు కూరగాయలను పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం వంటలకు అందించడం, ఇంకుడు గుంతల నిర్వహణ , కంపోస్ట్ ఎరువుల తయారీ, తదితర అంశాలపై చేస్తున్న కృషి నీ గుర్తించి కృషి ఫౌండేషన్ బడుగుల సైదులుకు ప్రకృతి రత్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కు ఎంపిక చేసింది.కాగా ఆదివారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవం లో బడుగుల సైదులు ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ భవిషత్ తరాలు ఆరోగ్యం గా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు.కాగా అవార్డు గ్రహీత ను కోదాడ ఎంఇఓ సలీం షరీఫ్,ఉపాధ్యాయులు అభినందించారు.

