Breaking News

రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 22న రైతు భరోసా డబ్బులు ఖాతాల్లోకి

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని నిర్ణయించింది. ఎ. రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట లో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు. ఈ అంశంపై సీఎం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమీక్ష నిర్వహించారు.

మొదటి విడతలో ఎంత?

మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. ముఖ్యంగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ఈ విడతలో నిధులు అందనున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విడతల వారీగా నిధుల విడుదల

  • 1వ విడత: రూ.3,590 కోట్లు – మార్చి 22
  • 2వ విడత: సుమారు రూ.2,650 కోట్లు – 20 రోజుల తర్వాత
  • 3వ విడత: ఏప్రిల్ చివర్లో విడుదల

మూడు విడతల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దాదాపు రూ.9,000 కోట్ల వరకు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *