పామర్రు, మార్చి 15(నేటి తెలుగు పత్రిక ): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ 92వ జయంతిని పామర్రులో అడ్వకేట్ పులి శ్రీనివాసరావు కార్యాలయం నందు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆనంతరం సెంటర్ లోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పులి శ్రీనివాసరావు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెగ్గం ప్రసాద్ రావు బి ఎస్ పి సీనియర్ నాయకులు గోపి నాయక్, పామర్రు నియోజకవర్గ సీనియర్ నాయకులు దాసరి భాను కుమార్, రామ్నాథ్, పి.ఎం.ఎస్. ప్రసాద్, సి.పి.యం.పామర్రు మండలం మాజీ కార్యదర్శి దునుకు రఘునాధరావు, నాగమల్లేశ్వరరావు మాస్టర్,అల్లంశెట్టి అంజి బాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.
