Breaking News

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

ఎంపీ చామలకి వినతిపత్రం అందజేసిన తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా.

కార్మికుల చెమటకే గౌరవం.. మే డే సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పలు సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. ఇందిరమ్మ గృహ పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని అని అడిగిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ప్రజా పాలన ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుందని అన్నారు.

విద్యార్థులకు సమగ్ర సదుపాయాలు సకాలంలోనే.. సెంట్రలైజ్డ్ కొనుగోళ్లపై సీఎం రేవంత్ కఠిన ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *