విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మూడుసార్లు కిందపడ్డాడు అయినా ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చాడు, నవీన్ యాదవ్ సంచలన విజయం వెను క అంతులేని కష్టం దాగి ఉందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో తుమ్మల పల్లి కళాక్షే త్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవులు సంఘాలు ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్, శాసనసభ్యులు వల్లాల నవీన్ కుమార్ యాదవ్ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శాసన సభ్యు లు వల్లాల నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ప్రజాసేవ చేస్తుం డగా ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. పదవి లేకపోయినా కూడా మా నాన్న ప్రజలకు ఎప్పుడూ ముందుండి సహాయం చేసేవారని గుర్తు చేశారు. మా కుటుంబం నుంచి సహాయం పొందిన లక్షలాది మంది చేసిన ప్రార్థనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో నే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. నా తండ్రి కలను సాకారం చేయుటకు రాజకీయా ల్లోకి వచ్చిన నన్ను గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజక వర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. యాదవ కమ్యూనిటీని మరింత బలపరచడానికి నేను నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఒక ప్పుడు ప్రజాసేవలో చిన్న శ్రీశైలం యాదవ్ ఎలా ముందుండేవారో, నేను కూడా అదే మార్గంలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. యాదవ సమా జం ఎప్పుడూ ఐక్యంగా ఉండి పరస్పరం సహకరిం చుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలు పునిచ్చారు. విద్య, ఐక్య త, సేవాభావంతో యాద వులు మరింత ఎదిగి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. తనకు సన్మాన సభను ఏర్పాటు చేసిన యాదవ ఐక్యవేదిక సంఘాల నాయకులకు శాసనసభ్యులు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ తొలిసారిగా విజయవాడ నగరానికి విచ్చేయగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సుమారు 100 పైగా కార్ల భారీ ర్యాలీతో యాదవ ఐక్యవేదిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మార్గమధ్యంలో గజమాలలు వేసి, బంతిపూల వర్షంతో నవీన్ యాదవ్ని అభిమానులు, యాదవ సంఘాల నాయకులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాద వులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

