హైదరాబాద్,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన మండలి భవనం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు.
