హైదరాబాద్, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించారు. రాష్ట్ర పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే ప్రభుత్వ పాలనకు ప్రధాన లక్ష్యమని చెప్పారు.తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు. 2047 నాటికి “తెలంగాణ రైజింగ్” లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గుర్తింపు పెరుగుతోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి ద్వారా తెలంగాణ ప్రపంచానికి దిక్సూచిగా మారుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
