Breaking News

ఖతార్ నుంచి భారత్‌కు ఎల్పీజీ గ్యాస్‌.. ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌక

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో గ్యాస్ సరఫరాకు ఊరట కలిగించేలా ఖతార్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చిన నౌక గుజరాత్ తీరానికి చేరుకుంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ కు చేరుకోవడంతో గ్యాస్ సరఫరా సమస్యలు కొంతవరకు తీరనున్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ ఎల్పీజీ ట్యాంకర్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఈ నౌక ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్ట్ నుంచి బయలుదేరి హార్ముజ్ జలసంధి దాటి భారత్‌కు చేరుకుంది.ఇక రాస్ లఫాన్ నుంచి బయలుదేరిన మరో నౌక నందా దేవి LPG ట్యాంకర్ ప్రస్తుతం గుజరాత్ తీరానికి సమీపంలో ఉంది. ఈ నౌక రేపు ఉదయం 6:30 గంటలకు కాండ్లా ఓడరేవు కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ రెండు నౌకలు కలిపి భారత్‌కు మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకొస్తున్నాయి. దీంతో దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

“రాయల్ “అనాలి- లేకపోతే 5 కోట్ల రాయల వారసుల మద్దతు వుండదు.

గ్యాస్ ధరలపై ఊరట.. పారిశ్రామిక వినియోగదారులకు భారీగా తగ్గించిన అదానీ టోటల్ గ్యాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *