Breaking News

రంజాన్ సందర్భంగా నిత్య అవసరాలు సమకూర్చిన బీర్ల ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపిన మైనార్టీ సభ్యులు

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు షరాజీపేట గ్రామంలో పవిత్ర రంజాన్ సందర్భంగా మధ్యతరగతి మైనారిటీ కుటుంబాలయిన మాకు మానవీయత కోణంలో మా నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలన్న వారి శ్రీమతి బీర్ల అనిత గారు బీర్లఫౌండేషన్ ద్వారా మాకు పండుగ నిత్య అవసరాలు సమకూర్చిన సందర్భంగా మా గ్రామం మైనారిటీ పక్షాన వారికి మేమందరం కృతజ్ఞులము వారి సేవలు మాకే కాదు ప్రతి కుటుంబానికి ఆపద్బాంధవులుగా ఉండి సేవలు అందించి జీవితాలను నిలబెట్టిన గొప్ప మనసున్న చిరస్మరణీయ స్థానం సంపాదించిన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత కు ప్రత్యేక అభినందనలు , ధన్యవాదములు ఇది ప్రజా వాయిస్ చెప్పడానికి గర్విస్తున్నాము అని అన్నారు.బీర్ల ఫౌండేషన్ ఆశయాలకు మద్దతుగా షరాజీ పేట గ్రామ సర్పంచ్ శ్రీ కంతి మధు విజయ డైరీ చైర్మన్ బత్తుల నరేందర్ రెడ్డి , వైస్ సర్పంచ్ దూడల శ్రీధర్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కంతి చిలుకు నాగ రాజు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడల సంతోష్ నారి మల్లయ్య , పెండ్యాల సత్యనారాయణ , మోరిగాడి శ్రీనివాస్ , గండికోట సంతోష్ , కంది మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా వీరందరికీ మైనార్టీ ద్వారా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామని మైనార్టీ సభ్యులు ఎండి రసూల్ అన్నారు.

కార్మికుల కష్టం దేశ సంపదకు మూలం: కేసీఆర్

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *