Breaking News

చిరంజీవి–విశ్వనాథ్ కాంబో కోసం చిన్న డ్రామా ఆడా: అల్లు అరవింద్

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయాలని చాలా కాలంగా కోరుకున్నానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఆ కలయిక సాధించేందుకు తాను ఒక చిన్న డ్రామా కూడా ఆడినట్లు ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.అప్పట్లో విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా వస్తే బాగుంటుందని తనకు బలమైన కోరిక ఉండేదని అల్లు అరవింద్ చెప్పారు. ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ముందుగా చిరంజీవి ఇంటికి వెళ్లి “మీరు సినిమాలో ఉంటే బాగుంటుందని విశ్వనాథ్ గారు అనుకుంటున్నారు” అని చెప్పానని తెలిపారు.

జంతు హింసపై యాంకర్ రష్మి ఆగ్రహం.. వైసీపీ నిరసనపై విమర్శలు

తర్వాత విశ్వనాథ్‌ను కలిసి “చిరంజీవి గారు మీతో సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు” అని చెప్పానని, ఇలా ఇద్దరికీ చెప్పి ఒక చిన్న డ్రామా ఆడానని ఆయన వెల్లడించారు.ఆ తర్వాత ఈ కలయిక నిజమై, విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచాయి.తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన విశ్వనాథ్ తన అద్భుతమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన తెరకెక్కించిన స్వాతి ముత్యం చిత్రం 1986లో ఆస్కార్ అవార్డులకు భారతదేశ అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఆయనకు ఐదు జాతీయ అవార్డులు, పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (సౌత్), అలాగే పద్మశ్రీ మరియు 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించాయి.

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *