బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

చిరంజీవి–విశ్వనాథ్ కాంబో కోసం చిన్న డ్రామా ఆడా: అల్లు అరవింద్

చిరంజీవి–విశ్వనాథ్ కాంబో కోసం చిన్న డ్రామా ఆడా: అల్లు అరవింద్

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయాలని చాలా కాలంగా కోరుకున్నానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఆ కలయిక సాధించేందుకు తాను ఒక చిన్న డ్రామా కూడా ఆడినట్లు ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.అప్పట్లో విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా వస్తే బాగుంటుందని తనకు బలమైన కోరిక ఉండేదని అల్లు అరవింద్ చెప్పారు. ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ముందుగా చిరంజీవి ఇంటికి వెళ్లి “మీరు సినిమాలో ఉంటే బాగుంటుందని విశ్వనాథ్ గారు అనుకుంటున్నారు” అని చెప్పానని తెలిపారు.

తర్వాత విశ్వనాథ్‌ను కలిసి “చిరంజీవి గారు మీతో సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు” అని చెప్పానని, ఇలా ఇద్దరికీ చెప్పి ఒక చిన్న డ్రామా ఆడానని ఆయన వెల్లడించారు.ఆ తర్వాత ఈ కలయిక నిజమై, విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచాయి.తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన విశ్వనాథ్ తన అద్భుతమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన తెరకెక్కించిన స్వాతి ముత్యం చిత్రం 1986లో ఆస్కార్ అవార్డులకు భారతదేశ అధికారిక ఎంట్రీగా నిలిచింది. ఆయనకు ఐదు జాతీయ అవార్డులు, పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (సౌత్), అలాగే పద్మశ్రీ మరియు 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?