Breaking News

ఎస్సీ–ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలి

కరీంనగర్, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం కరీంనగర్‌కు విచ్చేసిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇన్‌చార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, ఇన్‌చార్జి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దివాకర్ రావు తదితరులు బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అమలు చేస్తున్న పథకాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సమావేశాలకు స్వాగతం పలికిన బీర్ల ఐలయ్య

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *