మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిశానిర్దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ జాబ్ మేళాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, బ్లూస్ప్రింగ్, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి, పర్యాటక మరియు హాస్పిటాలిటీ నైపుణ్య మండలి తదితరంగా మొత్తం 110 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి.మొత్తం 5,323 మంది యువత జాబ్ మేళాకు హాజరుకాగా, అందులో 1,903 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 868 మంది తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది. జాబ్ మేళా నిర్వహణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సంస్థలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
