మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రజల తరఫున ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గట్టిగా ప్రశ్నిస్తామని, అవసరమైతే నిలదీస్తామని చెప్పారు.డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కె. టి. రామారావు కు దీనితో ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని ఎవరైనా కోరితే అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పిలవాలని అన్నారు. తాము కూడా టెస్టులకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు.
