హైదరాబాద్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ జాతి గౌరవం, సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గవర్నర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోని బండ ప్రకాష్ మరియు బండ ప్రకాష్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
