Breaking News

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు: పవన్ కళ్యాణ్

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహనీయుడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచానికి తెలియజేసిందని పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దిశగా పొట్టి శ్రీరాములు బీజం వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చేసిన నిరాహార దీక్ష, ప్రాణత్యాగం భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు.పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన త్యాగం ఎప్పటికీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనర్ట్ యానోడ్ ఎలక్ట్రోలైజర్ ప్రారంభించిన రసూల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *