Breaking News

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేసిన త్యాగం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం 58 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేపట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. చివరకు తన ప్రాణాలను త్యాగం చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారని తెలిపారు.భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు కూడా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మార్గం చూపిందని ఆయన అన్నారు. ఆయన త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనర్ట్ యానోడ్ ఎలక్ట్రోలైజర్ ప్రారంభించిన రసూల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *