విజయవాడ,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో “ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఫర్ నేచర్” పేరుతో రెండు రోజుల సదస్సును నిర్వహించనున్నట్లు ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు.ఈ సదస్సు మార్చి 17, 18 తేదీల్లో హోటల్ హయత్ ప్లేస్ విజయవాడ లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నివాస ట్రస్ట్ మరియు CMS వటవరన్ సంయుక్తంగా నిర్వహిస్తుండగా, నాలెడ్జ్ పార్ట్నర్గా CR మీడియా అకాడమీ వ్యవహరిస్తోంది.సదస్సు వివరాలను తెలియజేయడానికి మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు అదే హోటల్లోని వీర్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ వసంతి రావు(డైరెక్టర్ జనరల్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, న్యూ ఢిల్లీ) మరియు రిషికేశ్ చవాన్ (డైరెక్టర్, నివాస ట్రస్ట్) పాల్గొననున్నట్లు వెల్లడించారు.
మీడియా సమావేశం వివరాలు
- తేదీ: మార్చి 16, 2026 (సోమవారం)
- సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
- వేదిక: వీర్ హాల్, Hotel Hyatt Place Vijayawada
- సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు హై టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
