Breaking News

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

కరీంనగర్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): భాషా ప్రయుక్తా రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఆర్యావైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన దయంతి ఉత్సవాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురికి మేయర్ స్వీట్లు తినిపించారు. అనంతరం వాసవి క్లబ్ ఆద్వర్యంలో చలివేంద్రంను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, మాట్లాడుతూ మహాత్మాగాంధీ బోధించిన అహింస, సత్యం హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆనాడు మద్రాస్ నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ… నిరాహర దీక్ష చేస్తూ… మరణించిన మహనీయులను అన్నారు. ఆయన పోరాట స్పూర్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పూర్తి దాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సమావేశాలకు స్వాగతం పలికిన బీర్ల ఐలయ్య

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *