అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్, టిజి భరత్, పి నారాయణ, సవిత పాల్గొన్నారు.అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


