Breaking News

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కోదాడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టాఫ్

కోదాడ ,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలు విడుదల కావడంలో దీర్ఘకాలంగా జరుగుతున్న ఆలస్యాల వల్ల అధ్యాపకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగినది.
సూర్యాపేట జిల్లా కు చెందిన అధ్యాపక సభ్యులము , రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను విడుదల చేయడంలో సంవత్సరాలుగా జరుగుతున్న ఆలస్యాల కారణంగా మేము ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక మరియు వ్యక్తిగత సంక్షోభాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని రావడం జరిగినది.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మొత్తాన్ని విడుదల చేసి అధ్యాపకుల సమాజాన్ని ఆదుకోవాలని కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమం లో కోదాడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు పెరుమాళ్ళ పల్లి గాంధీ, రమేష్, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్, స్రవంతి, రాజశ్రీ, అరుణ, ధరావత్ రవి,కృష్ణమూర్తి, మోతిలాల్, నర్సి రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

బూడిద బిక్షమయ్య గౌడ్ ను కలిసిన బొమ్మలరామారం సర్పంచ్ కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్

సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ.. ఉభయ సభల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *