మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా ఆల్రౌండర్ తిలక్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2026 లో భారత్ ఘనవిజయం సాధించిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తిలక్ వర్మను సత్కరించి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకొచ్చినందుకు ప్రశంసలు కురిపించారు. యువ క్రీడాకారులకు తిలక్ వర్మ ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
