మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఐఈడీ పేలుడులో తీవ్రంగా గాయపడిన ఆయన, తన ఒక కాలును కోల్పోయినప్పటికీ అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారు.ఆయనతో జరిగిన సంభాషణలో అజేయమైన ధైర్యం, అచంచలమైన మనోబలం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. దేశ సేవ పట్ల ఆయన అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన సేవలకు వందనం తెలియజేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
