మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్ తో కలిసి హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. బంధువులందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, పిల్లలతో సరదాగా గడిపిన మహేశ్ బాబు అందరి దృష్టిని ఆకర్షించారు. కుటుంబ సమేతంగా ఆయన పాల్గొనడం వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది.
