బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ జయరాం యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ సిలివేరి సత్యనారాయణ, బెల్లంపల్లి టౌన్ జనరల్ సెక్రటరీ ఆడేపు మహేష్, కాంగ్రెస్ నాయకులు జంజీరాల మనోహర్, రాచకొండ గోవర్ధన్ రావు లు పాల్గొన్నారు.
