మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు.మైనారిటీ వర్గాల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణాలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా మైనారిటీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.అలాగే మైనారిటీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
