Breaking News

ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. హ్యామ్ (HAM) రోడ్ల పేరుతో సుమారు రూ.18 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ కుంభకోణంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్ & బీ)లో రూ.12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ లో రూ.6 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.ఇప్పటి ప్రభుత్వం 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తోందని, అందులో కమిషన్లు తీసుకుని ఎన్నికల ఖర్చుల కోసం మళ్లిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను వ్యతిరేకించిన ఎ. రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు.ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

రైతులకు తక్షణ సాయం చేయాలి: సీఎం‌ రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

గ్యాస్ ధరల పెంపుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *