మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్కు యోగేష్ గౌతమ్ నాయకత్వం వహిస్తున్నారు.ఈ కేసులో కీలకంగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, పైలట్ రోహిత్ రెడ్డి సహా మరో నలుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్యాల అవశేషాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో భాగంగా పుట్టా మహేష్ గన్మెన్లు లేకుండా పార్టీకి హాజరైన అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈ కేసు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్గా మారింది. సిట్ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
