Breaking News

రెండున్నరేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. టి. రామారావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తిగా వైఫల్యంగా మారిందని ఆరోపించారు.“ఎగ్గొట్టు.. చెడగొట్టు.. కూలగొట్టు” అన్నట్లుగా ప్రభుత్వ పని తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొడుతున్నారని, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను చెడగొడుతున్నారని విమర్శించారు. అలాగే గతంలో నిర్మించిన ప్రాజెక్టులను కూడా నిర్లక్ష్యం చేసి కూలగొడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.

కాసిపేట 1 ఇంక్లైన్ గనిని సందర్శించిన మందమర్రి జిఎం

స్పోర్ట్స్ మెటీరియల్ కొరకు అప్లికేషన్ అందజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *