Breaking News

మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.45 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేశారు.నిన్న రాత్రి ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం ఈ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, అదే రాత్రి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ స్పందన వేగం స్పష్టమైంది.ఈ నిర్ణయం ముస్లిం మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తుందని పేర్కొంటున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు అందించడం ద్వారా వారి జీవనోపాధికి సహాయపడటమే లక్ష్యమని తెలిపారు.

“దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం… ఏపీఈడీబీ కార్యాలయం ప్రారంభించిన లోకేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *