Breaking News

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం… ఏపీఈడీబీ కార్యాలయం ప్రారంభించిన లోకేశ్

మంగళగిరి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు (APEDB) నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సైకాంత్ వర్మ, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ & ఎండీ ఎం. అభిషిక్త్ కిషోర్, ఉన్నతాధికారులు ఎం. టి. కృష్ణ బాబు, సౌరభ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫిన్స్ కళాశాల ప్రతినిధి బృందం

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *