మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): “కాలమే సమాధానం చెబుతుంది” అంటూ ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. రాజకీయాల్లోకి రాకుండా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ రజనీకాంత్ను బెదిరించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్, “కాలం మాట్లాడదు కానీ అది ఎదురుచూసి సమాధానం ఇస్తుంది” అని పేర్కొన్నారు.అలాగే ఈ వివాదంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
