మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వానికి సింగిల్ ఎజెండాగా ఉండాలని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకోసం పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్లు, ఐటీ రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగాల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాల సృష్టి అత్యంత కీలకమని, ప్రతి యువకుడికి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
