Breaking News

కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్… ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో న్యూఢిల్లీలో కీలక సీఈసీ సమావేశం జరిగింది. రాబోయే కేరళ శాసనసభ ఎన్నికలు కు సంబంధించిన సన్నాహాలను ఈ సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో కేరళ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. కేరళ ప్రజల ఆకాంక్షలు, సమస్యలను కేంద్రంగా ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.పార్టీని బలపరిచే చర్యలు, గ్రౌండ్ స్థాయిలో కార్యకలాపాలు పెంచడం, ఎన్నికలలో మెరుగైన ఫలితాల కోసం వ్యూహాత్మక నిర్ణయాలపై నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

గ్యాస్ ధరల పెంపు ముందే హెచ్చరించా: రాహుల్ విమర్శలు

రాహుల్ వ్యాఖ్యల కేసులో ఊరట.. ఎఫ్ఐఆర్ ఆదేశాలపై హైకోర్టు తిరస్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *