మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో మహిళా సంఘాల రుణాల లెక్కలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష నేత కె. టి. రామారావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సూటిగా సవాల్ విసిరారు.సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మహిళా సాధికారతలో భాగంగా రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, అంత పెద్ద మొత్తాన్ని కొద్ది నెలల్లో ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. ఈ లెక్కలు నిజమని నిరూపిస్తే తాను వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంకెల గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.అదే సమయంలో ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. తమ వద్ద మహిళా సంఘాల అకౌంట్లలోకి వెళ్లిన నిధుల వివరాలు ఉన్నాయని, చెప్పిన గణాంకాలు నిజమేనని ట్రెజరీ బెంచీలు స్పష్టం చేశాయి. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
